పెను విషాదం.. 229కి చేరిన మృతుల సంఖ్య

56చూసినవారు
ఇథియోపియాలో పెను విషాదం చోటు చేసుకుంది. గోఫాలోని గెజ్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 229 మంది మరణించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న తమవారిని ప్రాణాలతో కాపాడుకునేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్