కలవరపెడుతున్న ‘చాందీపుర’ వైరస్‌

81చూసినవారు
కలవరపెడుతున్న ‘చాందీపుర’ వైరస్‌
గుజరాత్‌లో అనుమానాస్పద వైరస్‌ అయిన ‘చాందీపుర’ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ సోకడంతో జులై 10 నుంచి ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 12కు చేరిందని ఆరోగ్య శాఖ మంత్రి రిషికేశ్‌ పటేల్ తాజాగా వెల్లడించారు. ఈ వైరస్‌ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని, దోమలు, ఇతర కీటకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్