జోగి రమేష్‌కు బిగ్ షాక్

66చూసినవారు
జోగి రమేష్‌కు బిగ్ షాక్
అగ్రిగోల్డ్ భూముల వివాదంలో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్‌ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న జోగి రమేష్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. దేవభక్తుని చక్రవర్తికి పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. జోగి రమేష్‌ను మైలవరం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమిస్తూ వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్