భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్ట్ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ పలు కీలక సూచనలు చేశారు. పిచ్ స్పిన్కు అనుకూలించని పక్షంలో బౌలర్లను తెలివిగా రొటేట్ చేసుకోవాలన్నారు. ‘సాధారణంగా ఉప్పల్ పిచ్పై తగినంత టర్న్ లభించదు. కాబట్టి ఒకవేళ ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి లంచ్ బ్రేక్ సమయానికి శుభారంభాన్ని అందుకుంటే టీమిండియా సారథి తన బౌలర్లను ఎలా వినియోగించుకుంటాడో చూడాలి’ అని పేర్కొన్నారు.