రత్నభాండాగారం లోపలకి వెళ్లిన బృందం

567చూసినవారు
పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజల అనంతరం రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. ఈ రత్నభాండాగారాన్ని మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. మూడో గదిలోకి 11 మందితో కూడిన ఒక బృందం వెళ్లింది. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకొచ్చేందుకు ఆరు భారీ పెట్టెలను భాండాగారంలోకి తీసుకెళ్లారు. పూరీ రత్నభాండాగారంలో మొత్తం మూడు గదులున్నాయి. వాటిలో మొదటి గదిని స్వామి వారికి పూజలో భాగంగా ప్రతి రోజూ తీస్తారు. ఇక రెండో గదిని అతి ముఖ్య సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు.

సంబంధిత పోస్ట్