విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా HYDలోని ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటలపాటు సాగిన భేటీలో 10 కీలక అంశాలపై చంద్రబాబు, రేవంత్రెడ్డి చర్చించారు. సమస్యల పరిష్కానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.