కేంద్రమంత్రి,
బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిపై మాజీ మంత్రి
కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత అట్టర్ ఫ్లాప్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డినే అని విమర్శించారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. 2018లో అంబర్పేట్లో ఓడిపోయిన సానుభూతితో గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలిచారని.. కానీ కిషన్ రెడ్డికి మరోసారి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు.