హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని బుధవారం 30,000 మందికి పైగా యాత్రికులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు మంచు లింగాన్ని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య 1,05,282కి చేరుకుందని అధికారులు తెలిపారు. అమర్నాథ్ యాత్ర శనివారం నుంచి జంట మార్గాల ద్వారా ప్రారంభమైంది. అనంత్నాగ్లోని 48 కి.మీ నున్వాన్-పహల్గామ్ మార్గం, గందర్బాల్లోని 14 కి.మీ బల్తాల్ మార్గాల గుండా యాత్రికులు శివుడిని సందర్శించుకున్నారు.