మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం: మోదీ

61చూసినవారు
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం: మోదీ
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రంలో హింస నిరంతరం తగ్గుముఖం పడుతోందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని నొక్కి చెప్పారు. ఈ అంశంపై రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మోదీ సమాధానమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్