వెయ్యికి చేరిన హజ్ మృతుల సంఖ్య?

76చూసినవారు
వెయ్యికి చేరిన హజ్ మృతుల సంఖ్య?
హజ్ యాత్రలో మరణించిన వారి సంఖ్య వెయ్యికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 90 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మక్కాలో 51 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మృతుల్లో అనేక దేశాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువగా ఈజిప్టుకు చెందినవారే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్