అప్పు తీర్చడానికి.. బాలికను అమ్మిన పెద్దమ్మ

65చూసినవారు
అప్పు తీర్చడానికి.. బాలికను అమ్మిన పెద్దమ్మ
కర్ణాటకలోని తుమకూరుకు చెందిన 11 ఏళ్ల బాలిక నాలుగో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురంలో ఉన్న పెద్దమ్మ సుజాత ఇంటికి వెళ్లింది. కాగా, భూస్వామి శ్రీరాములు నుంచి సుజాత రూ.35,000 అప్పు తీసుకుంది. దీనిని తీర్చేందుకు ఇంటికి వచ్చికి వచ్చిన బాలికను ఆమె పెద్దమ్మ అమ్మేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి తన కుమార్తెను విడిపించేందుకు అధికారులు, పోలీసులను ఆశ్రయించింది. దీంతో కొన్న వ్యక్తి నుంచి ఆ బాలికను కాపాడారు.

సంబంధిత పోస్ట్