కియా మోటార్స్ ఇండియా.. తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 నుంచి ధరలను పెంచే ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే నెల నుంచి కియా సోనెట్, క్యారెన్స్, సెల్టోస్ ధరలు గరిష్ఠంగా మూడు శాతం వరకు పెరగనున్నాయి. కమోడిటీ ధరలు పెరగడం, సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్ కాస్ట్ పెరగడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలో.. తమ సంస్థ ప్రైజ్ హైక్ తీసుకోవడం ఇదే తొలిసారి అని కియా చెబుతోంది.