రికార్డు ధర పలికిన పసుపు

563చూసినవారు
రికార్డు ధర పలికిన పసుపు
గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపు ధరలు ఈ ఏడాది సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. నిజామాబాద్‌ మార్కెట్‌లో సోమవారం గరిష్ఠంగా రూ.18,299 ధర పలికింది. పసుపు పంటలు ఇదే ఆల్ టైమ్ రికార్డు కావడం విశేషం. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పసుపు క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.16,205 పలికింది. పసుపు కాడి (కొమ్ము)కి ఈ ధర పలుకడం గడిచిన పదేండ్లలో ఇదే తొలిసారి అని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్