జేవీ సోమయాజులు 1928 జూలై 30న శ్రీకాకుళం జిల్లాలోని లు
కాలం అగ్రహారంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశి
వరావుల
ు. సోమయాజులు విజయనగరంలో చదువుకొన్నప్పటి నుంచే నాటకాలు వేసేవాడు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్ప పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి శారదాంబ అతనిని ప్రోత్సహించింది.