టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నారు. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడు కుడి కాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో బీసీసీఐ రెండో టెస్టు నుంచి విశ్రాంతి ఇచ్చింది. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో మెడికల్ పర్యవేక్షణలో ఉన్న అతడు పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 15 నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న మూడో టెస్టులో అతడు బరిలోకి దిగే అవకాశముంది.