బెంగాల్ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి

59చూసినవారు
బెంగాల్ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేసు ఎప్పుడు నమోదైందో బెంగాల్ ప్రభుత్వం చెప్పలేక పోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేసు న‌మోదు చేయ‌క‌ముందే పోస్టుమార్టం నిర్వ‌హించారా? అని ప్ర‌శ్నించింది. అస‌హ‌జ మ‌రణంగా కేసు ఎప్పుడు న‌మోదు చేశారో తెలపాలని కేసు ఎంట్రీ చేసిన అధికారిని కోరింది. తన 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని జస్టిస్ పార్దీవాలా అన్నారు.

సంబంధిత పోస్ట్