వచ్చిందే టైం.. చేసిందే డ్యూటీ.!

78చూసినవారు
వచ్చిందే టైం.. చేసిందే డ్యూటీ.!
వచ్చిందే టైం. చేసిందే డ్యూటీ అన్నట్లు ఉంది ప్రభుత్వ ఉద్యోగుల తీరు. రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యా, గృహ నిర్మాణ, జలవనరులు, ఇలా అన్ని ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది సమయానికి అటు, ఇటుగా వస్తున్నారు. కొందరైతే పూర్తి సమయపాలన పాటించడం లేదు. దీంతో వారి సేవ కోసం వచ్చే ప్రజలు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. బయోమెట్రిక్, ముఖ గుర్తింపు హాజరు ఉన్నా అందులోని లోపాలను వినియోగించుకొని విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్