యువ క్రికెటర్ సాయి కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుభ్మన్ జట్టును నడిపించిన తీరు అద్భుతం. అతడిని చూస్తే తొలిసారి సారథ్యం చేపట్టిన కెప్టెన్గా కనిపించడు. స్పిన్నర్గా నాకు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. మేం గెలిచినా, ఓడినా మా ఆటతీరు పట్ల గర్వంగా ఉంటాం. చివరి వరకూ పోటీనివ్వాలని మా కోచ్ ఆశిశ్ నెహ్రా ఎప్పుడూ చెబుతుంటాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం కోసం శ్రమించాం’’ అని సాయి కిశోర్ తెలిపాడు.