ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవివై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 ఏడాదిలో ప్రారంభించింది. ఉచిత స్వల్పకాలిక నైపుణ్య శిక్షణను అందించడం ద్వారా దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా నైపుణ్య శిక్షణ పొందిన యువతకు స్కిల్ సర్టిఫికేట్ను ఇస్తారు. దీంతో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ప్రభుత్వ ఆలోచన.