ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం.. ఇద్దరిపై వేటు(వీడియో)

68చూసినవారు
ఆలయంలో నగదును దొంగిలించిన ఇద్దరిపై వేటు పడింది. కర్ణాటకలోని గాలి ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల విరాళాల చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం.. భక్తుల విరాళాలను లెక్కిస్తున్న సమయంలో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు చోరీకి పాల్పడ్డారు. ఓ వ్యక్తి తొలుత డబ్బుల కట్టను తీసుకుని పూజారికి అందించగా, పూజారి దానిని అందుకుని పక్కకు వెళ్లిపోయాడు. ఈ ఘటన ఏడాది క్రితం జరగ్గా, తాజాగా వారిపై చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్