బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కార్యాలయంలో ఇటీవల చోరీ జరిగింది. ముంబైలోని తన కార్యాలయంలోకి దొంగలు ప్రవేశించి, నగదు, సినిమా నెగెటివ్లను దొంగిలించారని ఆయన వెల్లడించారు. ముంబై పోలీసులు దొంగతనానికి సంబంధించి మాజిద్ షేక్, మహ్మద్ దలేర్ బహ్రీమ్ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిద్దరూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వరుస దొంగతనాలను పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.