యూపీలోని మీరట్లో మంగళవారం ఆసక్తికర ఘటన జరిగింది. ఓ దొంగ స్థానికంగా దేవాలయంలో ప్రవేశించాడు. వెంటనే దేవునికి నమస్కరించాడు. ఆ తర్వాత ఆలయంలో కనిపించిన విలువైన వస్తువులను దొంగిలించాడు. తన పని పూర్తైన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అతడు పవిత్రమైన దొంగగా అభివర్ణిస్తున్నారు.