మణిపూర్లో రాష్ట్ర ప్రభుత్వమే లేదు. ఆ రాష్ట్రాన్ని కేంద్రమే పాలిస్తోంది. అక్కడ అధికారాలన్నీ కేంద్రం గుప్పెట్లోనే ఉన్నాయని కాంగ్రెస్ ఎంపి ఎ.బిమోల్ అకోయిజం విమర్శించారు. మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్.బీరెన్సింగ్కి అధికారిక హోదా కూడా నామమాత్రమే. అందుకే సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి బీరన్సింగ్ని ఆహ్వానించలేదు అని బిమోల్ వ్యాఖ్యానించారు.