AP: సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, అటవీ భూములు కూడా కొట్టేశారన్నారు. భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. పకడ్బందీగా చట్టాన్ని తీసుకొస్తాం. అవసరమైతే డ్రోన్ పెట్రోలింగ్కు కూడా శ్రీకారం చుడుతున్నాం. సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యం. 26 సైబర్ పోలీసు స్టేషన్లు పెడుతున్నాం. సైబర్ క్రైమ్ చేసిన నేరస్థులను వెంటనే పట్టుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.