రీటా ఫారియా 1966లో మిస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచారు. ఆమె తర్వాత మరో ఐదుగురు మన దేశం నుంచి ఈ కిరీటాన్ని పొందారు. 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖే, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్గా ఎంపికయ్యారు. ఇక 'మిస్ వరల్డ్ 2024' పోటీలు ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నాయి. మరి ఈసారి మన దేశం టైటిల్ సాధిస్తుందని ఆశిద్దాం.