ఈ రైల్వే స్టేషన్లో రోజూ 60 పైగా టిక్కెట్లు కొంటారు. కానీ వాటితో ఎక్కడికి ప్రయాణించరు. ఇలా వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం నెక్కొండలో రైల్వే స్టేషన్ లో జరుగుతోంది. ఇక్కడ ఇటీవల సికింద్రాబాద్-గుంటూరు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు తాత్కాలికంగా హాల్టింగ్ ఇచ్చారు రైల్వే అధికారులు. 3 నెలల పాటు ఆదాయం ఉంటేనే ఆ రైలు పూర్తిగా ఆగుతుందని షరతు పెట్టారు. దాంతో ప్రజలు విరాళాలు సేకరించి టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు.