ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్అంటూ ఓ వ్యక్తిని బురిడి కొట్టించారు సైబర్ నెరగాళ్లు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మాజీ ఉద్యోగికి ముంబై సైబర్క్రైమ్ ఆఫీసర్స్ పేరుతో ఓ కాల్ వచ్చింది. మీ పేరుతో వచ్చిన ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్, గడువు తీరిన 7 పాస్పోర్టులు ఉన్నాయంటూ అతడిని బెదిరించారు. బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకొని రూ. 49,35,134 దోచేశారు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.