చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ భారత్లో 200 యూనిట్ల సీల్ ఎలక్ట్రిక్ సెడాన్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. దేశంలో ప్రధాన నగరాలైన రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చిలో అత్యధిక డెలివరీలు జరిగాయి. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ మార్చి 5న భారత్ మార్చిలో లాంచ్ అయింది. ఇప్పటివరకు 1,000 బుకింగ్లను సంపాదించింది.