పరమ శివుని సన్నిధానాల్లో పరమ పవిత్రమైంది కేదార్నాథ్ మహాక్షేత్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలోని పర్వతాల్లో పరమశివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తారు. వేసవికాలం ప్రారంభంలో ఆలయాన్ని తెరవడం సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ ఆలయాన్ని పాండవులు నిర్మించారని తెలుస్తోంది. ఆలయం ముందు భాగంలో కుంతీదేవి, పాండవులు, శ్రీకృష్ణ విగ్రహాలు ఉంటాయి. సముద్రమట్టానికి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో ఉంటుందీ కేదార్నాథ్.