ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆలోజింప చేస్తోంది. ‘ప్రతీ ఒక్కరికీ జీవితంలో పోరాటం తప్పదు. ఎన్నో ఎత్తు పల్లాలు చూడాల్సి వస్తుంది. అయితే ఈ కష్టాలను సంతోషంగా తీసుకొని పోరాటం సాగించాలా? లేదా బాధతో బతకీడ్చాలా? అనేది మనమే నిర్ణయించుకోవాలి’ అన్ని అర్థం వచ్చేలా ఉన్న కొటేషన్ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.