టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత తనని జట్టు నుంచి తీసేసినప్పుడు ఎదుర్కొన్న కష్టాల గురించి వివరించాడు. ఒక యూట్యూబ్ షోలో మాట్లాడుతూ.. టీ20 ప్రపంచ కప్కు ఎంపికయ్యాక తను న్యాయం చేయలేకపోయానని డిప్రెషన్లోకి వెళ్లానని చెప్పాడు. నా కారణంగానే ఇండియా మ్యాచ్ ఓడిపోయిందని, ఇండియాకు తిరిగి రావొద్దని కొందరు తనను హెచ్చరించారని, బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొన్నాడు.