TG: పెళ్లైన వారం రోజులకే ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహబూబ్ నగర్ జిల్లా సీసీకుంట మండలం పార్దిపూర్కు చెందిన రాజు(30) బైక్పూ లాల్కోటకు వెళ్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న రమేశ్ అనే వ్యక్తి ఎదురుగా వస్తూ రాజు బైకు ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాజును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.