రోడ్డుపై అమర్చిన మూడు బాంబులను ఆర్మీ జవాన్లు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని మూసివేశారు. అనంతరం బాంబు స్క్వాడ్ను రప్పించి ఆ బాంబులను నిర్వీర్యం చేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అల్లాడిన మణిపూర్లో ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని నోంగ్డామ్, ఇథమ్ గ్రామాలను కలిపే రహదారిపై ఐఈడీలను అమర్చినట్లు ఆర్మీ సిబ్బంది ఆదివారం గుర్తించారు. ఆ వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో మూడు బాంబులను నిర్వీర్యం చేశారు.