ఏపీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఒడిశాలోనూ తమదే అధికారమని చెప్పారు. ఎంపీ సీట్లకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో 24–30, ఒడిశా, ఏపీలో 17 చొప్పున గెలుస్తామని పేర్కొన్నారు. కర్ణాటక, ఏపీలో ఓబీసీ కోటా కింద కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసిందని దుయ్యబట్టారు.