తిరుమల: 3 కి.మీ మేర బారులు తీరిన భ‌క్తులు

56చూసినవారు
తిరుమల: 3 కి.మీ మేర బారులు తీరిన భ‌క్తులు
క‌ళియుగ వైకుంఠం తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు భ‌క్తుల‌తో నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి బారులు తీరారు. స్వామి వారి ద‌ర్శనానికి 20 గంటల సమయం ప‌డుతోంది. వారాంతం వరకు భ‌క్తుల ర‌ద్దీ కొనసాగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్