తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు కారులో వెళ్తున్న భక్తులకు చిరుతపులి అడ్డుగా వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శేషాచలం అడవుల్లో చిరుతలు కనిపించడం సాధారణమైనప్పటికీ పాదచారుల మార్గం, ఘాట్ రోడ్లలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. గతేడాది ఆగస్టులో ఆరేళ్ల బాలికపై చిరుతపులి దాడి చేసిన విషయం తెలిసిందే.