ప్రపంచ దేశాల ఇరిగేషన్ ప్రాజెక్ట్ల గణాంకాలపై అమెరికా, జర్మనీ, ఫిన్లాండ్, చైనాకు చెందిన పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం ప్రకారం 21వ శతాబ్దం తొలి 15 ఏళ్లలో (2000-2015) ప్రపంచవ్యాప్తంగా సాగునీటి పారుదల 11 శాతం మేరకు విస్తరించింది. 2000-2015 మధ్యకాలంలో 29.7 కోట్ల హెక్టార్ల నుంచి 33 కోట్ల హెక్టార్లకు పెరిగింది. భారత్ 85 లక్షల హెక్టార్లలో సాగుభూమికి అదనంగా నీటి పారుదల సదుపాయాన్ని విస్తరింపజేసుకోనుంది.