నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ

592చూసినవారు
నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో సహా 8 మందిని సీబీఐ ఇవాళ విచారించనుంది. ఈనెల 27న విచారణకు రావాలంటూ వారికి సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కాగా రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా.. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఇప్పటికే తేల్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్