జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఐఐటీ మద్రాస్ విడుదల చేయనుంది. ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి గత నెల 26న నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది హాజరయ్యారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల మంది ఉన్నారని అంచనా.