మరి కాసేపట్లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా బంగ్లా టీమ్ను హెచ్చరించారు. భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని.. అతడి విషయంలో బంగ్లా అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘మీరు భారత్పై పట్టు సాధించాలని భావిస్తే మాత్రం బుమ్రాతో పెట్టుకోవద్దు. అతడి జోలికెళ్తే మాత్రం ఓటమిని కొనితెచ్చుకున్నట్లే’ అని లారా వ్యాఖ్యానించారు.