నేడు తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

53చూసినవారు
నేడు తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్