సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. తాజాగా ఈ మూవీ OTTకి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రముఖ OTT సంస్థ జీ5 దీని డిజిటల్ రైట్స్ను దక్కించుకున్నట్లు సమాచారం. మార్చి 15న ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. కాగా, ఈ మూవీ దాదాపు 10 రోజుల్లో రూ.25.11 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు హీరో సందీప్ ట్వీట్ చేశాడు.