పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సు తొలి మహిళా సీఎంగా మరియం నవాజ్(50) ఎన్నికయ్యారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్షరీఫ్ కుమార్తె అయిన మరియం.. జనాభాపరంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన పంజాబ్ ప్రావిన్సు సీఎంగా బాధ్యతలు చేపట్టడం విశేషం. తండ్రి నవాజ్ షరీఫ్, బాబాయ్ షెహబాజ్ షరీఫ్ల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.