టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత (వీడియో)

73చూసినవారు
టాలీవుడ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ పాటల రచయిత గురు చరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున మరణించారు. నటుడు మోహన్ బాబు కోసం ప్రత్యేకంగా ఆయన పాటలు రాసేవారు. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’ లాంటి సూపర్ హిట్ పాటలను అందించారు. గురుచరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు.

సంబంధిత పోస్ట్