ప్రధాని మోదీని కలవనున్న పారాలింపిక్స్ వీరులు (Video)

55చూసినవారు
పారిస్ పారాలింపిక్స్ మెరుపుతో ముగిశాయి. పారిస్ పారాలింపిక్స్‌లో అత్యధిక పతకాలతో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన అథ్లెట్లు మరికాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ మేరకు అథ్లెట్లు ఢిల్లీలో బసచేసిన హోటల్ నుంచి బస్సుల్లో బయలుదేరారు. ప్రధానిని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కొందరు ప్లేయర్లు అన్నారు. ఆయన తమను ప్రత్యేకమని ఫీలయ్యేలా చేస్తారని, ఆత్మవిశ్వాసం నింపుతారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్