స్వల్పంగా తగ్గిన గోదావరి వరద

77చూసినవారు
స్వల్పంగా తగ్గిన గోదావరి వరద
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద శాంతిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి గోదావరి భారీ వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 15.30 అడుగులకు పెరిగి అర్ధరాత్రి నుంచి నిలకడగా గోదావరి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 15.10 అడుగులకు నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని అధికారులు సముద్రంలోని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్