పట్టాలపై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు.. తప్పిన భారీ ప్రమాదం (వీడియో)

63చూసినవారు
ఒడిశాలో శనివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. దీంతో లోకో పైలెట్లు అప్రమత్తంగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. రైళ్లలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కొన్ని సాంకేతిక లోపాల వలన ఈ విధంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైల్వే అధికారులు కిందకు దిగి పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్