TG: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ పరారీలో ఉన్నాడు. దోషులైన అసదుల్లా అక్తర్, జియా ఉర్ రహమాన్, మహ్మద్ తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్లకు ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్దిస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.