రైలు కింద పడి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మిర్యాలగూడ మండల పరిధి వెంకటాద్రిపాలెం దుర్గానగర్లో చోటుచేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి (24), దుర్గా ప్రసాద్ గురువారం ఉదయం ఐలాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నారు. ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.