AP: కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణం జరిగింది. రెండు, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై బంగారు ఆభరణాలు తయారీ షాపు నిర్వహిస్తున్న యజమాని కామేశ్వరరావు లైంగికదాడికి పాల్పడ్డాడు. చిన్నారులకు చాకెట్లు, డబ్బుల ఆశచూపి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, విషయం తెలుసుకున్న బాలికల కుటుంబ సభ్యులు, స్థానికులు సదరు వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు.